మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం
యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ
శనివారం, ఏప్రిల్ 12, 2025
ఉచితంగా జరిగే రెండు కార్యక్రమాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం
ప్రత్యేక ప్రసంగం
“సత్యం తెలుసుకోవడం సాధ్యమేనా?”
యేసు సత్యం గురించి, దాన్ని ఎలా తెలుసుకోవచ్చనే దాని గురించి ఏం చెప్పాడో ఈ ప్రసంగంలో వివరిస్తారు.
యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ
సంవత్సరానికి ఒకసారి, యెహోవాసాక్షులు యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటారు. ఎందుకంటే, యేసు అలా చేయమని చెప్పాడు.—లూకా 22:19.
తరచూ అడిగే ప్రశ్నలు
ఎవరు రావచ్చు?
అందరూ రావచ్చు. మీ కుటుంబంతో రండి.
ఈ కార్యక్రమాలు ఎంతసేపు ఉంటాయి?
ప్రత్యేక ప్రసంగం అరగంట ఉంటుంది. ఆ తర్వాత ఒక బైబిలు అంశం మీద గంట పాటు చర్చ జరుగుతుంది.
జ్ఞాపకార్థ ఆచరణ కార్యక్రమం దాదాపు గంటసేపు ఉంటుంది.
ఎక్కడ జరుగుతాయి?
పైన ఉన్న “దగ్గర్లో ప్రత్యేక ప్రసంగం ఎక్కడ జరుగుతుంది?,” “దగ్గర్లో జ్ఞాపకార్థ ఆచరణ ఎక్కడ జరుగుతుంది?” అనే బటన్ల మీద క్లిక్ చేయండి.
హాజరవ్వాలంటే డబ్బులు కట్టాలా? దీనికి హాజరైతే తర్వాత కూడా మా మీటింగ్స్కు రావాల్సిందేనా?
లేదు.
చందాలు అడుగుతారా?
లేదు. మేము మా మీటింగ్స్లో ఎప్పుడూ చందాలు అడగము.—మత్తయి 10:8.
ఎలాంటి బట్టలు వేసుకోవాలి?
ఈ కార్యక్రమానికి ఇలాంటి బట్టలే వేసుకోవాలని నియమం ఏదీ లేదు. కానీ యెహోవాసాక్షులు అణకువగా, గౌరవంగా ఉండే బట్టలు వేసుకుంటారు.
జ్ఞాపకార్థ ఆచరణ ఎలా జరుగుతుంది?
ఈ ఆచరణ పాటతో, ఒక యెహోవాసాక్షి చేసే ప్రార్థనతో మొదలౌతుంది. అలాగే పాటతో, ప్రార్థనతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ఒక ప్రసంగం ఉంటుంది. అందులో యేసు మరణం ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుడు అలాగే యేసు మనకోసం చేసిన దాని నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో చెప్తారు.
ఎక్కువ తెలుసుకోవడానికి, “యెహోవాసాక్షులు ప్రభువు రాత్రి భోజనాన్ని మిగతావాళ్లు చేసుకున్నట్లుగా ఎందుకు చేసుకోరు?” అనే ఆర్టికల్ చూడండి.
రాబోయే జ్ఞాపకార్థ ఆచరణల తేదీలేంటి?
2025: శనివారం, ఏప్రిల్ 12
2026: గురువారం, ఏప్రిల్ 2
2027: సోమవారం, మార్చి 22
ఎక్కువ తెలుసుకోవడానికి, ఈ కింది వీడియోలను చూడండి.
యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి
ఈ ఆచరణ ఎలా జరుగుతుందో, అలాగే యేసు మరణం వల్ల ఎంత అద్భుతమైన భవిష్యత్తు సాధ్యమౌతుందో చూడండి.
యేసు మన పాపాల కోసం చనిపోయాడని మీరు వినే ఉంటారు. కానీ, ఒక్క మనిషి చనిపోతే లక్షలమంది ఎలా ప్రయోజనం పొందగలరు?
మా మీటింగ్స్ ఎలా జరుగుతాయో స్వయంగా మీరే చూడండి.