యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ

గురువారం, ఏప్రిల్‌ 2, 2026

సంవత్సరానికి ఒకసారి, యెహోవాసాక్షులు యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటారు. ఎందుకంటే, యేసు ఇలా చెప్పాడు: “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.”—లూకా 22:19.

మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తున్నాం.

తరచూ అడిగే ప్రశ్నలు

ఎవరు రావచ్చు?

అందరూ రావచ్చు. మీ కుటుంబాన్ని, స్నేహితుల్ని కూడా తీసుకురావచ్చు.

ఈ కార్యక్రమం ఎంతసేపు ఉంటుంది?

ఇది దాదాపు గంటసేపు ఉంటుంది.

ఎక్కడ జరుగుతుంది?

వివరాల కోసం మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షుల్ని అడగండి.

హాజరవ్వాలంటే డబ్బులు కట్టాలా?

లేదు.

చందాలు అడుగుతారా?

లేదు. మేము మా మీటింగ్స్‌లో ఎప్పుడూ చందాలు అడగము.—మత్తయి 10:8.

ఎలాంటి బట్టలు వేసుకోవాలి?

ఈ కార్యక్రమానికి ఇలాంటి బట్టలే వేసుకోవాలని నియమం ఏదీ లేదు. అయితే, ఈ ఆచరణ పవిత్రమైనది కాబట్టి యెహోవాసాక్షులు అణకువగా, గౌరవంగా ఉండే బట్టలు వేసుకుంటారు.

జ్ఞాపకార్థ ఆచరణ ఎలా జరుగుతుంది?

ఈ ఆచరణ పాటతో, ఒక యెహోవాసాక్షి చేసే ప్రార్థనతో మొదలౌతుంది. అలాగే పాటతో, ప్రార్థనతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ఒక ప్రసంగం ఉంటుంది. అందులో యేసు మరణం ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుడు అలాగే యేసు మనకోసం చేసిన దాని నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో చెప్తారు.

రాబోయే జ్ఞాపకార్థ ఆచరణల తేదీలేంటి?

2026: గురువారం, ఏప్రిల్‌ 2

2027: సోమవారం, మార్చి 22