యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ
గురువారం, ఏప్రిల్ 2, 2026
సంవత్సరానికి ఒకసారి, యెహోవాసాక్షులు యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటారు. ఎందుకంటే, యేసు ఇలా చెప్పాడు: “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.”—లూకా 22:19.
మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తున్నాం.
తరచూ అడిగే ప్రశ్నలు
ఎవరు రావచ్చు?
అందరూ రావచ్చు. మీ కుటుంబాన్ని, స్నేహితుల్ని కూడా తీసుకురావచ్చు.
ఈ కార్యక్రమం ఎంతసేపు ఉంటుంది?
ఇది దాదాపు గంటసేపు ఉంటుంది.
ఎక్కడ జరుగుతుంది?
వివరాల కోసం మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షుల్ని అడగండి.
హాజరవ్వాలంటే డబ్బులు కట్టాలా?
లేదు.
చందాలు అడుగుతారా?
లేదు. మేము మా మీటింగ్స్లో ఎప్పుడూ చందాలు అడగము.—మత్తయి 10:8.
ఎలాంటి బట్టలు వేసుకోవాలి?
ఈ కార్యక్రమానికి ఇలాంటి బట్టలే వేసుకోవాలని నియమం ఏదీ లేదు. అయితే, ఈ ఆచరణ పవిత్రమైనది కాబట్టి యెహోవాసాక్షులు అణకువగా, గౌరవంగా ఉండే బట్టలు వేసుకుంటారు.
జ్ఞాపకార్థ ఆచరణ ఎలా జరుగుతుంది?
ఈ ఆచరణ పాటతో, ఒక యెహోవాసాక్షి చేసే ప్రార్థనతో మొదలౌతుంది. అలాగే పాటతో, ప్రార్థనతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ఒక ప్రసంగం ఉంటుంది. అందులో యేసు మరణం ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుడు అలాగే యేసు మనకోసం చేసిన దాని నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో చెప్తారు.
ఎక్కువ తెలుసుకోవడానికి, “యెహోవాసాక్షులు ప్రభువు రాత్రి భోజనాన్ని మిగతావాళ్లు చేసుకున్నట్లుగా ఎందుకు చేసుకోరు?” అనే ఆర్టికల్ చూడండి.
రాబోయే జ్ఞాపకార్థ ఆచరణల తేదీలేంటి?
2026: గురువారం, ఏప్రిల్ 2
2027: సోమవారం, మార్చి 22